English | Telugu
సైలెంట్ గా ఓటీటీలోకి 'మేమ్ ఫేమస్'!
Updated : Jun 30, 2023
యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ ను హీరోగా, దర్శకుడిగా పరిచయం చేస్తూ ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం 'మేమ్ ఫేమస్'. ఎందరో కొత్తవాళ్లు పనిచేసిన ఈ సినిమా ఈ ఏడాది మే 26న థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా యూత్ ని ఈ సినిమా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
'మేమ్ ఫేమస్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది. అయితే పెద్దగా ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది 'మేమ్ ఫేమస్'. ఈరోజు(జూన్ 30) నుంచి ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకొని బయ్యర్లకు లాభాలను మిగిల్చిన మేమ్ ఫేమస్.. ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ పొందుతుందేమో చూడాలి.