English | Telugu

మయూరి ట్రైలర్..న‌య‌న‌తార చెమటలు పట్టిస్తోంది!!

న‌య‌న‌తార తొలిసారి హార‌ర్ చిత్రంలో న‌టిస్తోంది. అశ్విన్ శ‌ర‌వ‌న‌న్ ద‌ర్శకుడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కిన చిత్రం 'మయూరి'. త‌మిళంలో మాయ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న వినాయక చవితి సంధర్భంగా తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. భారీ హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార ఓ తల్లి పాత్రలో నటించింది. విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రతి క్షణం భయపెడుతూ, థ్రిల్ కు గురిచేసే విధంగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భారీగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.