English | Telugu

'మత్తు వదలరా-2' వచ్చేస్తోంది.. ఈసారి డబుల్ డోస్!

ఈమధ్య కుర్ర హీరోల సినిమాల సీక్వెల్స్ కూడా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. దానికి ఉదాహరణగా 'డీజే టిల్లు'కి సీక్వెల్ గా వచ్చిన 'టిల్లు స్క్వేర్'ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో కుర్ర హీరో నటించిన సీక్వెల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. (Mathu Vadalara 2)

శ్రీ‌ సింహా హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మత్తు వదలరా'. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ కామెడీ థ్రిల్లర్ 2019 డిసెంబర్ లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా నవ్వించిందో, అంతలా థ్రిల్ పంచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'మత్తు వదలరా-2' వస్తోంది. సైలెంట్ గా ఈ సీక్వెల్ కి పూర్తి చేసిన మేకర్స్.. తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్స్ ను వదిలారు. ఈసారి ఫన్, థ్రిల్ అన్నీ డబుల్ డోస్ లో ఉంటాయని మేకర్స్ పేర్కొన్నారు. అదే నిజమైతే.. 'టిల్లు స్క్వేర్' తరహాలో 'మత్తు వదలరా-2' కూడా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసే అవకాశముంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.