English | Telugu

ఏంటిది జక్కన్న.. మహేష్ బాబు సినిమాకి ఈ టైటిలా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా 'SSMB 29' (వర్కింగ్ టైటిల్). కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ మూవీ.. ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో రూపొందనుంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తరువాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో 'SSMB 29'పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించి, షూట్ ప్రారంభించే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఒక ఊహించని టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

'SSMB 29'కి 'మహారాజా' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ మూవీకి 'గోల్డ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మామూలుగా రాజమౌళి సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. 'సింహాద్రి', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'మగధీర', 'బాహుబలి' ఇలా పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టి.. టైటిల్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం రాజమౌళికి అలవాటు. అయితే ఇప్పుడు 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేస్తున్న అత్యంత భారీ చిత్రానికి 'గోల్డ్' అనే టైటిల్ పెట్టారనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం రాజమౌళికి గ్లోబల్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుంది. కాబట్టి గ్లోబల్ రీచ్ ఉండేలా 'SSMB 29' సినిమాకి ఇంగ్లీష్ టైటిల్ పెడతారు అనడంలో సందేహం లేదు. అయితే 'గోల్డ్' టైటిల్ అనేది క్లాస్ గా ఉంది. ఇండియన్ ఆడియన్స్.. అందునా తెలుగు ప్రేక్షకులు.. ఈ క్లాస్ టైటిల్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ఏదైనా సినిమా చేస్తుంటే.. దానికి సంబంధించిన ప్రతి చిన్న విషయంపై రాజమౌళి ఎంతో కేర్ తీసుకుంటారు. అలాంటిది సినిమాకి ఎంతో ముఖ్యమైన టైటిల్ విషయంలో ఆయన ఎంత ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి మహేష్ బాబు సినిమాకి నిజంగానే 'గోల్డ్' అనే టైటిల్ ఖరారు చేశారా లేదా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.