English | Telugu

'బాహుబలి' రికార్డులు..మహేష్ ఊహించలేదట

ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చారిత్రాత్మక మూవీ 'బాహుబలి'. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇండియా సినిమా రికార్డులను బద్దలుకొడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే ఈ సినిమాని చూసిన ఇండియా సినిమా దిగ్గజాలు ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు.

లేటెస్ట్ గా వీరి జాబితాలో చేరిపోయాడు మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు. హాలిడే కోసం విదేశాలు వెళ్ళిన మహేష్ ఇండియాకి తిరిగొచ్చిన వెంటనే 'బాహుబలి' సినిమాని చూశాడు.

''ఈ సినిమా చూస్తున్నప్పుడు తన రొమాలు నిక్కపొడుచుకున్నట్టు మహేష్ తెలిపారు. బాహుబలి తెలుగు వారికి గర్వం కారణం అని అన్నాడు. ఒక తెలుగు సినిమా మనదేశంలోను, బయట రికార్డులను కొల్లగొడుతుందని ఊహించలేదని, దానిని రాజమౌళి నిజం చేసాడని అన్నారు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టెరిఫిక్ గా వుందని, ఇంతటి గొప్ప చిత్రాన్ని తీసినందుకు ఆర్కా మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రభాస్, రానా పడిన కష్టానికి ఫలితం దక్కిందని, మీకూ మీ టీమ్కు కంగ్రాట్యులేషన్స్ రాజమౌళి'' అని ట్విట్టర్ ద్వార తన ఫీలింగ్స్ తెలియజేసాడు మహేష్.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.