English | Telugu

ఖైదీ2 గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్‌!

లోకేష్ క‌న‌గ‌రాజ్ నెక్స్ట్ సినిమా లియో. ద‌ళ‌ప‌తి విజ‌య్‌, సంజ‌య్‌ద‌త్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ 19న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు దాదాపు 400 కోట్ల రూపాయ‌ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని టాక్‌. దీంతో లోకేష్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఈ సినిమా తర్వాత లోకేష్ త‌లైవ‌ర్ 171ని డైర‌క్ట్ చేస్తారు. ఈ విష‌యాన్ని లోకేష్ స్వ‌యంగా వెల్ల‌డించారు. అంతే కాదు, ఈ సినిమా త‌ర్వాత అత‌ను ఖైదీ సీక్వెల్ ఖైదీ2ని చేస్తారు. అయితే, కోడంబాక్కం న్యూస్ ప్ర‌కారం ఈ లైన‌ప్‌లో పెద్ద మార్పు క‌నిపిస్తోంది. ఖైదీ2 సినిమా చేయాల్సిన కాల్షీట్ల‌లో లోకేష్ మ‌రో సినిమా చేయ‌డానికి ఫిక్స్ అయ్యార‌ట‌. ఆ సినిమా పేరు రోలెక్స్. సూర్య హీరోగా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ తెర‌కెక్కిస్తుంది.

క‌మ‌ల్‌హాసన్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన విక్ర‌మ్ సినిమా క్లైమాక్స్ లో రూత్‌లెస్ విల‌న్‌గా న‌టించారు సూర్య‌. ఆ కేర‌క్ట‌ర్ పేరే రోలెక్స్. ఇప్పుడు ఆ కేర‌క్ట‌ర్ ఆధారంగా ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.రీసెంట్‌గా రోలెక్స్ సినిమా గురించి సూర్య కూడా మెన్ష‌న్ చేశారు. ఈ సినిమా త‌ర్వాత లోకేష్‌తో ఇరుంబు కై మాయావి అనే మూవీ కూడా చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు. అయితే, ఖైదీ 2 లేద‌న్న‌ది కార్తి ఫ్యాన్స్ కి మాత్రం చేదు వార్తే. ఎందుకంటే ఆయ‌న్ని ఢిల్లీ రోల్‌లో ఇంకో సారి చూడ‌టానికి త‌హ‌త‌హ‌లాడుతున్నారు ఫ్యాన్స్. అంద‌రికీ తెలిసిన ఈ విష‌యాన్ని లోకేష్ కూడా క‌న్సిడ‌ర్ చేస్తార‌నే టాక్ కూడా ఒక‌టి న‌డుస్తోంది. ఈ సినిమాలో సూర్య‌, కార్తి ఇద్ద‌రూ ఉండేలా లోకేష్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. రోలెక్స్, ఢిల్లీ కేర‌క్ట‌ర్ల‌ను క‌లిపి లోకేష్ ఓ స్క్రిప్ట్ చేశార‌నే మాట‌లు కూడా న‌డుస్తున్నాయి. 2024 ఆఖ‌రున‌గానీ, 2025 ప్రారంభంలోగానీ, ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్తుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.