English | Telugu

పవన్ కళ్యాణ్ ని యోగి ఆదిత్యనాధ్ తో పోలుస్తున్న కృష్ణవంశీ 

దర్శకుడుగా కృష్ణవంశీ(krishna vamsi)కి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. నిన్నే పెళ్లాడుతా దగ్గర్నుంచి రంగ మార్తాండ వరకు ఆయన టచ్ చెయ్యని జోనర్ లేదు.పైగా వాటన్నిటిలోను భారీ హిట్స్ ని అందుకొని సుదీర్ఘ కాలం నుంచి టాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతు వస్తున్నాడు.రీసెంట్ గా ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)వన్ మాన్ షో మురారి(murari)రీ రిలీజ్ లో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి కృష్ణవంశీ స్టామినాని మరోసారి అందరికి గుర్తు చేసింది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే కృష్ణవంశీ అభిమానులు వేసే ప్రశ్నలకి చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్తుంటాడు.రీసెంట్ గా ఒక అభిమాని ప్రస్తుతం తిరుపతి లడ్డు(tirupati laddu)విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)తీసుకున్న స్టాండ్ గురించి మీ అభిప్రాయమేంటని అడగగా మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి.పవన్ లాంటి వాళ్ళు మరింత మంది రాజకీయాల్లోకి రావాలి.అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో ఒక వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడు.అందుకు భగవంతుడు ఆయనకి ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజం ఎప్పటికైనా నిజమే.

దానికి ఎవరి అంగీకారం అవసరం లేదు.పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ హీరో అని మరోసారి రుజువయ్యింది.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్(Yogi Adityanath)తర్వాత అంతటి విలువలు, తెలివి తేటలు కల్గిన ప్రత్యేక రాజకీయవేత్త పవన్ అని చెప్పుకొచ్చాడు.దీంతో పవన్ అభిమానులైతే కృష్ణవంశీ నాలుక మీద మచ్చ ఉంటే బాగుండని కోరుకుంటున్నారు.నాలుక మీద మచ్చ ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు నిజమవుతాయనే నానుడి ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.