English | Telugu

'బాహుబలి’ని చంపింది ఏవరు..అతను ఏవరూ?

'బాహుబలి’ విడుదలై మూడు వారాలు గడుస్తున్నా.. ఇంకా బాహుబలి చిత్రం గురించి చర్చ జరుగుతూనే ఉంది..విడుదల కు ముందు సినిమా కథ ఏంటి..సినిమా ఎలా ఉండబోతుంది అనే చర్చ జరుగింది..ఇప్పుడు ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు?..అసలు సెకండ్ పార్ట్ కథ ఏంటి..? రమ్య కృష్ణ ఎందుకు రాజ్యం నుండి తప్పించుకొని వస్తుంది..? అసలు అనుష్క ఎవరు..? అనే ప్రశ్నలకు ఎవరికీ తోచిన సమాదానం వారు చెపుతూ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచుతున్నారు..

బాహుబలి’ని నేనే చంపా అంటూ కట్టప్ప చేత చెప్పించి రాజమౌళి ట్విస్టు ఇస్తే, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ‘‘బాహుబలి’ని కట్టప్ప చంపాడని ఎందుకు అనుకుంటున్నారు. ‘బాహుబలి’ని కట్టప్ప చంపలేదు. కేవలం పొడిచాడంతే’ అని చెప్పి, రాజమౌళి ఇచ్చిన ట్విస్టు మించిన ట్విస్టు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చాడు . దీంతో కట్టప్ప ముసుగులో ‘బాహుబలి’ని చంపింది ఎవరని ఆరా తీస్తున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.