English | Telugu

మెగాస్టార్ సినిమాలో విలన్ గా యంగ్ హీరో!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. 2025 సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు రావిపూడి. పైగా వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నారని మూవీ టీం చెబుతోంది. దీంతో ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడీ 'సంక్రాంతి అల్లుడు'కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఇందులో యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటించబోతున్నాడట.

యువ హీరోలు, దర్శకులలో చిరంజీవికి ఎందరో అభిమానులున్నారు. వారిని చిరు ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పటికే యంగ్ హీరో సత్యదేవ్ 'గాడ్ ఫాదర్' మూవీలో నెగటివ్ రోల్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అవకాశం కార్తికేయకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కార్తికేయకు ఇప్పటికే విలన్ గా నటించిన అనుభవముంది. నాని 'గ్యాంగ్ లీడర్', అజిత్ 'వలిమై' వంటి సినిమాల్లో విలన్ గా నటించి ఈ కుర్ర హీరో మెప్పించాడు. ఇప్పుడు ఏకంగా తన అభిమాన నటుడు చిరంజీవిని ఢీ కొట్టే పాత్ర చేయబోతున్నాడు.

'ఆర్ఎక్స్ 100'తో యువతకు చేరువైన కార్తికేయ.. ఆ తర్వాత హీరోగా ఆస్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే విలన్ గా సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి ఇప్పుడు మెగాస్టార్ మూవీ కార్తికేయ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.