English | Telugu

ఇద్ద‌రి పెద‌వుల్నీ పిండేసిన క‌మ‌ల్‌

క‌మ‌ల్‌హాస‌న్ సినిమా అంటే... స‌మ్‌థింగ్ స్పెష‌ల్ ఉండాల్సిందే. క‌థ‌,క‌థ‌నాల్లో త‌న‌దైన ముద్ర చూపిస్తుంటారాయ‌న‌. అయితే.. త‌న సినిమాలో శృంగారం మిక్స్ చేయ‌డంలో క‌మ‌ల్‌.. రూటే సెప‌రేటు. క‌మ‌ల్ సినిమాల్నీ ఓసారి ప‌రిశీలించండి. ఏదోలా రొమాన్స్ మిక్స్ చేస్తుంటాడు. లిప్‌లాక్‌ల‌కైతే లెక్కేలేదు.

తాజాగా... చీక‌టి రాజ్యంలోనూ త‌న విశ్వ‌రూపం చూపించేశాడ‌ని టాక్‌. ఇదో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. అస్త‌మానూ... ఫైట్లూ, ఛేజింగులే చూపిస్తే అంత కిక్ ఉండద‌ని క‌మ‌ల్ ఫీలై ఉంటాడు. అందుకే ఈ సినిమాలో లిప్‌లాక్‌ల‌కు చోటిచ్చాడ‌ట‌. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్లున్నారు. త్రిష ఓ క‌థానాయిక‌గా క‌నిపిస్తే.. మ‌ధుశాలిని మ‌రో క‌థానాయిక‌. వీరిద్ద‌రి పెద‌వుల్నీ ఓ స‌న్నివేశంలో ఎడాపెడా పిండేశాడ‌ట క‌మ‌ల్‌.

చీక‌టి రాజ్యం సినిమాలో ఈ లిప్‌లాక్ స‌న్నివేశాలు కూడా హైలెట్‌గా నిలుస్తాయ‌ని త‌మిళ చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. త్రిష చాలాకాలం త‌ర‌వాత లిప్ లాక్ సన్నివేశంలో క‌నిపించింద‌ని, క‌మ‌ల్ అనేస‌రికి మ‌ధుశాలికి లిప్‌లాక్ సీన్‌లో జీవించేసింద‌ని త‌మిళ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకొంటున్నాయి. మ‌రి వెండి తెర‌పై ఆ స‌న్నివేశాలు ఎలా పండాయో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.