English | Telugu

హ్యాట్రిక్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రభాస్ తర్వాత ఒకే ఒక్కడు..!

'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఎన్టీఆర్ కెరీర్ లో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమా 'వార్-2' కావడం విశేషం.

'ఆర్ఆర్ఆర్'తో మొదటిసారి ఈ ఫీట్ సాధించాడు ఎన్టీఆర్. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.1300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'దేవర' కూడా దాదాపు రూ.500 కోట్లు సాధించింది. ఇక ఇప్పుడు 'వార్-2' ఐదు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరి.. 400 కోట్ల దిశగా పయనిస్తోంది.

ఇప్పటిదాకా హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ కలిగి ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ గా ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ ఏకంగా రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు. మొదటిసారి 'బాహుబలి-1', 'బాహుబలి-2', 'సాహో' సినిమాలతో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' చిత్రాలతో మరోసారి హ్యాట్రిక్ 300 కోట్లు సాధించాడు. ప్రభాస్ తర్వాత హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ ఉన్న టాలీవుడ్ హీరోగా ఇప్పుడు ఎన్టీఆర్ నిలిచాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.