English | Telugu

పాకిస్థాన్ వల్ల నా ఊరు తగలపడింది..స్టార్ రైటర్ జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు 

పాకిస్థాన్ వల్ల నా ఊరు తగలపడింది..స్టార్ రైటర్ జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు 

భారతీయ చిత్ర పరిశ్రమలో రచయితకి స్టార్ డమ్ తెచ్చిన వాళ్ళల్లో 'జావేద్ అక్తర్'(javed Akhtar)కూడా ఒకరు. మరో స్టార్ రైటర్ సలీంతో కలిసి సలీం-జావేద్(saleem- Javed)పేరుతో  ఎన్నో సూపర్ హిట్ సినిమాలని ప్రేక్షకులకి అందించాడు. సోలో రైటర్ గా కూడా చరిత్ర సృష్టించిన సినిమాలకి రూపకల్పన చేసాడు. జంజీర్, అందాజ్, షోలే, దీవార్, డాన్, శక్తి, మిస్టర్ ఇండియా, సాగర్, అర్జున్, డెకాయిట్, ఖేల్, రూప్ కి రాణి చోరంకా రాజా వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. గేయ రచయితగా కొన్ని వందల పాటలకి సాహిత్యాన్ని అందిస్తు వస్తున్న జావేద్, షారుఖ్ గత చిత్రం డంకీ లో కూడా అద్భుతమైన సాంగ్ రాసారు

రీసెంట్ గా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు 'పహల్ గామ్(Pahal Gam)దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉంది. అమాయకుల్ని అన్యాయంగా కాల్చి చంపారు. ఈ విషయాన్నీ మనం మర్చిపోకూడదు. ఒకసారి నేను పాకిస్థాన్ లోని లాహోర్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కి హాజరయ్యాను. ఒక విలేకరి నాతో మీ భారతీయులంతా పాకిస్థాన్ ని ఉగ్రవాదులని అనుకుంటున్నారా అనే ప్రశ్న వేసాడు. అప్పుడు నేను అతనితో నేను ముంబై వాసిని, నా నగరంపై ఎన్నోసార్లు దాడి జరిగి నా కళ్ల ముందే తగలబడింది. ఈజిప్టు, స్వీడన్ నుంచి వచ్చిన వాళ్లు ఆ విధంగా చెయ్యలేదు. పాకిస్థాన్ కి చెందిన వాళ్లే చేసారు. ఇప్పటికి వాళ్ళు పాకిస్థాన్ లో ప్రశాంతంగా తిరుగుతున్నారని చెప్పాను. నేను ఇండియాకి వచ్చాక  నా మాటల విషయం తెలిసి  పాకిస్థాన్ లో గొడవలు జరిగాయి. 

శత్రువులు ముంబైని మళ్ళీ  టార్గెట్ చేసే అవకాశం ఉంది. మన దేశంలో ఏ ప్రభుత్వమైనా శాంతి కోసమే ప్రయత్నిస్తుంది. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ దేశస్థుల మృతదేహాల్ని పాకిస్థాన్ చిన్నచూపు చూసింది. అలాంటి వారితో స్నేహంగా ఎలా ఉండాలి. తొంబై తొమ్మిది శాతం మంది కాశ్మీరీలు భారతదేశానికి విధేయులని చెప్పుకొచ్చాడు. జావేద్ అక్తర్ ఐదు సార్లు జాతీయ అవార్డులతో పాటు పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలని   అందుకున్నాడు.