English | Telugu

నాలోని క్రికెటర్ బాధ పడలేక మూడు సార్లు వెళ్లిపోదామనుకున్నాను 

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా లెవల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారుతుంది. దీంతో శ్రీదేవి అభిమానుల ఆనందం మాములుగా లేదు. తన తల్లి లాగా ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జాన్వీ ఒక మూవీ నుంచి తప్పుకోవాలని అనుకుందనే వార్త చూసి అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. అసలు విషయం ఏంటో చూద్దాం

జాన్వీ అప్ కమింగ్ మూవీ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి. ప్రముఖ హీరో రాజ్ కుమార్ రావు తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. మే 31 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ మూవీలో జాన్వీ ప్రొఫిషనల్ క్రికెటర్ గా మెరవబోతుంది. క్యారక్టర్ పర్ఫెక్షన్ కోసం రెండు సంవత్సరాల నుంచి క్రికెట్ లో శిక్షణ తీసుకుంటుంది. పైగా తనని పూర్తి స్థాయి క్రికెటర్‌గా మార్చడానికి కోచ్ లు కూడా చాలా కష్టపడ్డారు. ఇక షూటింగ్ టైం లో అయితే చెప్పక్కర్లేదు. జాన్వీ కి ఎన్నో సార్లు గాయాలయ్యాయి. ఒక దశలో తన రెండు భుజాలు పని చెయ్యలేదు. ఆ సమయంలో ఎన్నోసార్లు సినిమా నుంచి వైదొలగాలని అనుకుంది. కానీ చిత్ర యూనిట్ ఆమెకి ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు. ఈ విషయాలన్నీ జాన్వీ కపూర్ నే చెప్పింది. ప్రస్తుతం ఆ మాటలు వైరల్ గా మారాయి

చాలా మంది జాన్వికి సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్ ని పొగుడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర లో చేస్తుంది.అక్టోబర్ లో ఆ మూవీ విడుదల కానుంది. అలాగే రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు మూవీ లోను హీరోయిన్ గా చేస్తుంది. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. రాబోయే రోజులన్నీ జాన్వీ వే

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.