English | Telugu

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్.. 'గరుడ'ను మహేష్ తో చేస్తున్న రాజమౌళి!

'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్ తో 'గరుడ' అనే భారీ బడ్జెట్ చేయాలనుకున్నాడు. 'ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో గరుడ' అనే వార్త అప్పట్లో మారుమోగిపోయింది. రాజమౌళి సైతం 'బాహుబలి' తర్వాత 'గరుడ' చేసే ఆలోచన ఉందని అప్పట్లో చెప్పాడు. కానీ ఆ ఎందుకనో ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆ స్థానంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' అనే మల్టీస్టారర్ చేశాడు రాజమౌళి. దీంతో 'గరుడ' గురించి అందరూ మర్చిపోయారు. ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. (SSMB 29)

మహేష్ బాబు హీరోగా రాజమౌళి చేయనున్న ప్రాజెక్ట్.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా రూపొందనుందని ముందు నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కొత్త ప్రచారం మొదలైంది. అప్పుడు ఎన్టీఆర్ తో చేయాలనున్న 'గరుడ'నే.. ఇప్పుడు మహేష్ తో రాజమౌళి చేస్తున్నాడని న్యూస్ వినిపిస్తోంది. ఓ రకంగా ఇది సర్ ప్రైజ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది అంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.