English | Telugu

బెట్టింగ్ కేసులో మరో కోణం.. విజయ్ చేసింది తప్పా ఒప్పా..?

బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారంటూ విజయ్ దేవరకొండ సహా మొత్తం 25 మందిపై హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీని వల్ల విజయ్ చిక్కుల్లో పడతాడా? అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారికి విజయ్ టీమ్ నుంచి ధైర్యాన్ని నింపే వార్త వచ్చింది. (Vijay Deverakonda)

బెట్టింగ్ యాప్స్ కు విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే వార్తల నేపథ్యంలో ఆయన టీమ్ స్పందించింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ ప్రచారం నిర్వహించాడని, అవి చట్టప్రకారమే నిర్వహిస్తున్నారని టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ ప్రచారకర్తగా పరిమితమయ్యాడని పేర్కొంది.

ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించలేదని టీమ్ తెలిపింది. అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశాడని, సుప్రీం కోర్టు సైతం రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు తెలియజేసిందని టీమ్ గుర్తు చేసింది. అలాగే ఏ 23 కంపెనీతో విజయ్ ఒప్పందం గతేడాది ముగిసిందని, ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. విజయ్ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .