English | Telugu

ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్!

టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్ళు, ఆఫీస్ లపై ఆదాయ‌ ప‌న్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నివాసంతో పాటు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ కార్యాలయాల్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించిన సినిమాలంటే ముందుగా 'పుష్ప: ది రైజ్', 'ఆర్ఆర్ఆర్' గుర్తుకొస్తాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో 'పుష్ప-2' రూపొందుతోంది. అలాగే ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో పలు సినిమాలను కూడా నిర్మిస్తున్నారు సుకుమార్. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన 'ఆర్ఆర్ఆర్' ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. వరల్డ్ వైడ్ గా రూ.1200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాల దర్శకనిర్మాతలపై ఐటీ సోదాలు జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సోదాలకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.