English | Telugu

'ఘాటి' ట్రైలర్.. సీతమ్మోరు లంకా దహనం చేస్తే..?

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఘాటి'. ఇద్దరికీ ఇది కమ్ బ్యాక్ ఫిల్మ్ లాంటిది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'ఘాటి'పై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. (Ghaati Trailer)

డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో 'ఘాటి' తెరకెక్కిందని ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. డ్రగ్స్ మాఫియా కింద పని చేస్తూ.. ఆ మాఫియాకే ఎదురుతిరిగిన పవర్ ఫుల్ పాత్రలో అనుష్క కనిపిస్తోంది. లవ్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నీ అంశాలు ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివరిలో అనుష్క రుద్ర రూపం ఆకట్టుకుంది. "సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో సూద్దురు గాని" అనే ఒక్క డైలాగ్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు.

ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క పెట్టింది పేరు. అరుంధతి, భాగమతి వంటి సినిమాలు ఆమె కెరీర్ లో ఉన్నాయి. ఇప్పుడు 'ఘాటి' ట్రైలర్ లోనూ అనుష్క నట విశ్వరూపం కనిపిస్తోంది.

'ఘాటి' చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అనుష్క మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు, డైరెక్టర్ క్రిష్ కూడా సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.