English | Telugu

ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి వస్తున్న ఆ వార్తలు నమ్మకండి!

ఇటీవల భారీ వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. ఎందరో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు విరాళాలను ప్రకటించారు. అటు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ఇటు రామ్ చరణ్ (Ram Charan) కూడా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున, చెరో కోటి రూపాయలు ప్రకటించారు. అయితే ఏపీకి ప్రకటించిన విరాళాన్ని చెక్ ల రూపంలో అందించడం కోసం.. ఎన్టీఆర్, చరణ్ ఈరోజు సీఎం చంద్రబాబు(Chandrababu)ని కలవబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదు. రామ్ చరణ్ ప్రస్తుతం ట్రావెలింగ్ లో ఉన్నారని, సీఎం చంద్రబాబుని కలుస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని.. ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. అలాగే ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు సైతం.. ఆయన చంద్రబాబుని కలుస్తున్నారన్న వార్తలను తోసిపుచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' (Devara) ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారని తెలిపాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.