English | Telugu

శివరాత్రికి గుడ్ న్యూస్ చెప్తా...ఇది దేవర హామీ

తన ఒంటి చేత్తో సినిమాని నడిపించి ఆ సినిమాకి బాక్స్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించే ఎనర్జిటిక్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు.ఏ యాంగిల్ లో ఫ్రేమ్ పెట్టినా కూడా నవ నూతనంగా నటించగల తిరుగులేని మిస్సైల్ ఎన్టీఆర్. ఆయన చేసే యాక్టింగ్ కి ఫైట్స్ కి డాన్స్ కి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తాజాగా దేవర చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన గుడ్ న్యూస్ ఒకటి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

ఎన్టీఆర్ దేవర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. దీంతో దేవర ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని అందరు ఎదురుచూస్తున్నారు.తాజాగా దేవర రిలీజ్ డేట్ ని వచ్చే నెల శివరాత్రి రోజున మేకర్స్ వెల్లడి చేయనున్నారనే వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.ఇప్పుడు ఈ వార్తతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం దేవర లో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ లో గాయాలపాలవ్వడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో దేవర మూవీ ఇప్పుడప్పుడే రాదని సెప్టెంబర్ లో ఉండవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచం నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరికి ఎనర్జీ ని ఇవ్వడం కోసమే మేకర్స్ దేవర అప్ డేట్ ని ఇవ్వనున్నారనే టాక్ చాలా బలంగా వినిపిస్తుంది. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం విడుదలైన దేవర టీజర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి థియేటర్స్ లో దుమ్ము రేపుతోంది. టీజర్ చివరలో ఎన్టీఆర్ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తురునే ఎక్కువ చూసింది అందుకే దీనిని ఎర్ర సముద్రం అని అంటారు అని చెప్తాడు. ఎన్టీఆర్ లాంటి నటుడు ఉన్నాడు కాబట్టే అది తెలుగు సినిమా అయ్యిందని ఇప్పుడు ఫ్యాన్స్ అంటున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.