English | Telugu

ప్రముఖ హీరోయిన్ కి షాక్ ఇచ్చిన కోర్టు.. 60 కోట్లు డిపాజిట్ చేస్తావా

భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు శిల్పాశెట్టి(Shilpa Shetty). హీరోయిన్ గా విభిన్నమైన క్యారెక్టర్స్ ని పోషించి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఒక బడా వ్యాపార వేత్తని అరవై కోట్ల రూపాయిల మేర మోసం చేసిన కేసులో శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా(Raj kundra)పై కేసు నమోదయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ముంబై ఆర్ధిక నేరాల విభాగానికి చెందిన పోలీసులు కూడా ఈ కేసులో లుకౌట్ నోటీసులు జారీ చేసారు. దీంతో అనుమతి లేకుండా దేశం దాటి వెళ్ళకూడదు.

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా లు శ్రీలంక దేశం రాజధాని కొలొంబో(Colombo)లో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే కార్యక్రమానికి ఈ నెల 25 , 29 మధ్య హాజరు కావాల్సి ఉంది. దీంతో తమపై లుకౌట్ ఆర్దర్స్ ఉన్న నేపథ్యంలో కొలొంబో వెళ్ళడానికి అనుమతి కోరుతు శిల్పాశెట్టి దంపతులు సంబంధిత కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. తాజాగా కోర్టు ఆ పిటిషన్ ని తిరస్కరించింది. ఒక వేళ దేశం విడిచి వెళ్లాలంటే 60 కోట్ల రూపాయిలు డిపాజిట్ చెయ్యాలని, ఆ తర్వాతే తదుపరి విచారణ కొనసాగుతుందని కూడా కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.