English | Telugu

హాస్యనటుడు కొండవలస ఇక లేరు

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటులలో ఒకరైన కొండవలస ఈరోజు హఠాన్మరణం చెందారు. అనారోగ్యంతో హైద్రాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కొండవలస పూర్తి పేరు కొండవలస లక్ష్మణరావు. ఆగస్టు 10 1946వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో లక్ష్మణరావు జన్మించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' కొండవలస లక్ష్మణరావుకి తొలి సినిమా. తక్కువ కాలంలోనే వేగంగా అవకాశాలు దక్కించుకున్న కొండవలస, ప్రముఖ కమెడియన్ గా వెలుగొందారు.సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌లో క్లర్క్‌గా ఉద్యోగం చేశారు. ఉద్యోగాల్లో చేస్తూనే నాటకాల్లో నటించారు. నాటక రంగంలోనూ అనేక అవార్డుల్ని కొండవలస సొంతం చేసుకున్నారు. దాదాపు 300 సినిమాల్లో నటించారాయన. ఓ గొప్ప నటుడిని పరిశ్రమ కోల్పోయింది. కొండవలస కుటుంబానికి తెలుగువన్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.