English | Telugu

ఒకే వేదికపై పవన్, చిరు..!

మెగా అభిమానులు చాలా రోజులుగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై చూడాలని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కోరికను తీర్చబోతున్నాడు మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ముకుంద’ ఆడియో వేడుక అక్టోబర్4న చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ వేదికపైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి సందడి చేయనున్నారని సమాచారం. అయితే చాలాకాలంగా మెగా అభిమానుల మధ్య విభేదాలున్నాయని మీడియాలో వస్తున్న వార్తలకు ముకుందుడు చెక్ పెట్టబోతున్నాడని మెగా అభిమానులు ఆనందపడుతున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.