English | Telugu

ఏంటి చిరూ మరీనూ!

సినిమా గురించి క్లారిటీ వచ్చినంత వరకూ ఓ టెన్షన్. క్లారిటీ వచ్చాక డైరెక్టర్ టెన్షన్. ఆ తర్వాత హీరోయన్ టెన్షన్. ఇదంతా ఎవరిగురించి అంటారా ఇంకెవరండీ మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించే. ఇన్ని టెన్షన్స్ తర్వాత ఎట్టకేలకు పూరీ జగన్నాధ్ డైరెక్టర్ అని క్లారిటీ వచ్చింది. అప్పుడే ఫస్ట్ ఆఫ్ చిరు విన్నారు...సూపర్ అన్నారని పూరీ సంబరపడుతూ ట్వీట్ చేశాడు. ఇక చిరు బర్త్ డే నాడు ఎనౌన్స్ మెంట్ తరువాయి అని అంతా ఎదురుచూస్తున్నారు.

ఇంతలో చిరు అభిమానులకు మరో టెన్షన్ పట్టుకుంది. పూరీ కథ సిద్ధం చేస్తున్నాడంటూనే...మరోవైపు చిరు,వినాయక్ కలసి మాట్లాడుకున్నారు. అంతేనా...చిన్నికృష్ణ కథ సిద్ధం చేశాడని... ఆ కథను వినాయక్ తెరకెక్కించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో చిరు 150 సినిమా నుంచి పూరీ అవుట్ అయి వినాయక్ వచ్చాడా? లేదా పూరీతో సినిమా తర్వాత వినాయక్ కు డేట్స్ ఇస్తాడా? ఇంతకీ చిరంజీవి 150 వసినిమా ఏ దర్శకుడితో? ఇప్పుడిదే హాట్ టాపిక్. దీనికి క్లారిటీ రావాలంటే ఆగస్ట్ 22 రావాలి మరి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.