English | Telugu

నితిన్ ప‌రువు తీసిన ఛార్మి

నితిన్ - పూరి జ‌గ‌న్నాథ్ సినిమా ఆగిపోవ‌డంతో ఇండ్ర‌స్ట్రీ షాకయ్యింది. రెండ్రోజుల్లో సినిమా మొద‌ల‌వుతుంది అనుకొంటే ఈలోగా క్యాన్సిల్ అయిన‌ట్టు అటు పూరి, ఇటు నితిన్ ఇద్ద‌రూ ప్ర‌క‌టించేశారు. ఈ ప్రాజెక్టులో ఛార్మి ఎంట‌ర్ అవ్వ‌డంతోనే సినిమా ఆగిపోయింద‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. జ్యోతిల‌క్ష్మికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది ఛార్మి. నితిన్ సినిమాకీ ఛార్మినే ప్రొడ‌క్ష‌న్ చూసుకొంటుంద‌ని పూరి సెల‌విచ్చాడ‌ట‌. ప్ర‌పోజ‌ల్ న‌చ్చ‌క నితిన్ ఈ సినిమాకి నో చెప్పాడ‌ని చెప్పుకొన్నారు. అయితే ఈ వ్య‌వ‌హారంపై ఛార్మి స్పందించింది.

ఆ సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణం నేను కాదు. నితిన్ సంస్థ శ్రేష్ట్ మీడియా ద‌గ్గ‌రే డబ్బుల్లేవ్‌ అని బ‌య‌ట చెబుతోంద‌ట ఛార్మి. ప్ర‌స్తుతం శ్రేష్ట్ మీడియా అఖిల్‌తో ఓ సినిమా చేస్తోంది. దీనికి వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. త‌మ సొమ్మంతా ఈసినిమాపైనే పెట్టుబ‌డి పెట్టార‌ని, అందుకే పూరి సినిమా చేయ‌లేక‌పోతున్నార‌ని ఛార్మి త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెబుతోంద‌ట‌. అయితే అంద‌రూ నిజం తెలుసుకోకుండా త‌న‌ని నిందిస్తున్నార‌ని వాపోతోంద‌ట‌.

నితిన్ ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవంటే ఇది న‌మ్మాలా..?? ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాల‌తో భారీ లాభాలు సంపాదించాడు నితిన్‌. చిన్న‌దాన నీ కోసం ఫ్లాప్ అయినా... నితిన్ న‌ష్ట‌పోయిందేం లేదు. మ‌రి ఛార్మి ఈ కామెంట్లు ఎందుకు చేసిందో, ఏంటో?

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.