English | Telugu

చక్రి భార్య శ్రావణికి ప్రాణహాని వుందా?

చక్రి కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని వుందని, అందుకే తాను మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించానని చక్రి భార్య శ్రావణి మీడియాకు తెలియజేశారు. చక్రి తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు తనను హింసించారని, ఆస్తికోసం వేధిస్తున్నారని చక్రి భార్య శ్రావణి మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. అలాగే చక్రి మరణించిన వారి కుటుంబసభ్యులు ప్రవరిస్తున్న తీరు తనకు భయాన్ని కలిగించాయని ఆమె తెలిపారు. చక్రి ఆరోగ్యం విషమంగా ఉన్నవిషయాన్ని చెప్పడానికి తాను ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే ఎవరూ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని ఆమె తెలిపారు. దాంతో తాను కనీసం కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా అంబులెన్స్‌లో చక్రిని ఆస్పత్రికి తీసుకెళ్ళానని అన్నారు. చక్రి చనిపోయిన తర్వాత చక్రి చనిపోయాడన్న బాధ కంటే చక్రి ఆస్తి మీద ఆసక్తి వారిలో ఎక్కువగా కనిపించింది. నేను బాధతో రోదిస్తుంటే చక్రి తరఫు బంధువులెవరూ నన్ను ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం మంచినీళ్ళు అయినా తాగానా లేదా అని కూడా పట్టించుకోలేదు. ఆయన కర్మకాండలు పూర్తి కాకముందే ఆస్తికోసం వీళ్ళ వేధింపులు ఎక్కువయ్యాయి అని ఆమె తెలిపారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.