English | Telugu

మెగాస్టార్ తో పోటీకి దిగుతున్న అఖిల్ అక్కినేని!

ఇటీవల 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో మెగాస్టార్ మెగా కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రం 'భోళా శంకర్'పై అంచనాలు పెరిగిపోయాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి పోటీగా అక్కినేని అఖిల్ చిత్రం విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది.

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఏజెంట్'. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోన్న ఈ ఫిల్మ్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇప్పటికే ఏప్రిల్ 14 డేట్ ని 'భోళా శంకర్' లాక్ చేసుకుంది. మరి ఆ సినిమా ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో 'ఏజెంట్'ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారా లేక పోటీకి సిద్ధపడే బరిలోకి దింపుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

పైగా ఈ రెండు చిత్రాలు ఒకే బ్యానర్ లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందుతుండటం విశేషం. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ సైతం తాము నిర్మించిన రెండు బడా సినిమాలు 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి'లను ఒకేసారి విడుదల చేసి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సైతం అదే బాటలో పయనిస్తుందేమో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.