English | Telugu

బండ్ల గణేష్ టూ కంట్రీస్ టాప్ స్టార్ ఎవరు?



బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా భారీ చిత్రాలు నిర్మించే బండ్ల గణేష్ మరో బ్లాక్ బస్టర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మలయాళంలో దిలీప్, మమతా మోహన్ దాస్ జంటగా నటించిన టూ కంట్రీస్ చిత్రం సూపర్ డూపర్ హిట్టై 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు నిర్మాత బండ్ల గణేష్. టూ కంట్రీస్ చిత్ర తెలుగు హక్కుల్ని విపరీతమైన పోటీ నడుమ దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఏ మలయాళ చిత్రానికి కూడా ఇవ్వనంత ఎక్కువ ధరకు టు కంట్రీస్ చిత్ర హక్కుల్ని పొందారు. బడా నిర్మాతలు ఈ చిత్రం కోసం పోటీ పడ్డారు. ఈ చిత్రాన్ని తెలుగులో భారీగా నిర్మించేందుకు బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే... పలువురు టాప్ స్టార్స్ ఈ చిత్రంలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'మలయాళ బ్లాక్ బస్టర్ టూ కంట్రీస్ చిత్ర హక్కుల్ని భారీ పోటీ మధ్య దక్కించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రం. అందుకే భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ ఈ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గం గురించి తెలియజేస్తాను'. అని అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.