English | Telugu

నిర్మాత నాగవంశీపై బాలయ్య అభిమానుల ఆగ్రహం.. అందుకే ఈవెంట్ కి హాజరు కాలేదా..?

ఒక మంచి సినిమాని రూపొందించడం ఎంత ముఖ్యమో, దానిని భారీ ప్రమోషన్స్ తో ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంత కంటే ముఖ్యం. కానీ కొందరు నిర్మాతలు తెలిసో తెలియకో ప్రమోషన్స్ విషయంలో అశ్రద్ధ చూపించి.. సినిమాకి రావాల్సినంత విజయాన్ని దక్కకుండా చేస్తారు. ఇటీవల విడుదలైన 'డాకు మహారాజ్' విషయంలో అదే జరిగింది. బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమాని, ఒక మామూలు హిట్ సినిమాకి పరిమితం చేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే రీసెంట్ గా జరిగిన 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్ కి సైతం నిర్మాత నాగవంశీ డుమ్మా కొట్టారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Nandamuri Balakrishna)

'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ నటించిన సినిమా కావడంతో పాటు.. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో 'డాకు మహారాజ్'పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, బాలయ్య సినిమా స్థాయి ప్రమోషన్స్ చేయనప్పటికీ.. 'డాకు మహారాజ్' ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ ని, ఓపెనింగ్స్ ని చూసి.. ఫుల్ రన్ లో రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. బాలకృష్ణ అభిమానులు కూడా.. ఈ సినిమా తమ హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుందని సంబరపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. విడుదలకు ముందు ప్రమోషన్స్ ని మమా అనిపించిన మేకర్స్.. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చిన కూడా ప్రమోషన్స్ లో దూకుడు పెంచలేదు. (Naga Vamsi)

ఈ సంక్రాంతికి మూడు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలను దిల్ రాజు నిర్మించడంతో పాటు, నాగవంశీ నిర్మించిన 'డాకు మహారాజ్'కి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే 'డాకు మహారాజ్'కి అన్యాయం జరిగిందని బాలయ్య అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాను బాలకృష్ణ అభిమానిని అని నాగవంశీ పదే పదే చెబుతుంటారు. కానీ ఆ అభిమానానికి తగ్గట్టుగా 'డాకు మహారాజ్' ప్రమోషన్స్ లేవు. పైగా తెలంగాణలో టికెట్ ధరల పెంపుకి అవకాశం ఉన్నా కూడా.. కనీసం ప్రయత్నించలేదు. అయినప్పటికీ 'డాకు మహారాజ్' రికార్డ్స్ ఓపెనింగ్స్ సాధించి, సత్తా చాటింది. పోనీ ఆ తర్వాత అయినా ప్రమోషన్స్ లో దూకుడు పెంచి జనరల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారా అంటే.. అదీ లేదు. పైగా థియేటర్ల విషయంలోనూ తీవ్ర అన్యాయం జరిగింది. నిజానికి సంక్రాంతి సినిమాల్లో 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ రెండు సినిమాల థియేటర్ల కేటాయింపు విషయంలో వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. 'డాకు మహారాజ్' మంచి వసూళ్లను రాబడుతున్న ఏరియాల్లోనూ ఆ థియేటర్లను 'సంక్రాంతికి వస్తున్నాం'కి కేటాయించారు. ఇలా 'డాకు మహారాజ్'కి అడుగడుగునా అన్యాయం జరిగింది. (Daaku Maharaaj)

రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాల్సిన సినిమాను రూ.150 కోట్ల గ్రాస్ క్లబ్ కి పరిమితం చేశారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచి సినిమాని చంపేశావని, ఇంకెప్పుడు బాలయ్యతో సినిమా చేయొద్దని నాగవంశీపై కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దర్శకుడు బాబీ సైతం నిర్మాత నాగవంశీ తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తన గత చిత్రం 'వాల్తేరు వీరయ్య'కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, అదిరిపోయే ప్రమోషన్స్ చేసి దానిని రూ.200 కోట్ల క్లబ్ లో చేర్చారు ఆ చిత్ర నిర్మాతలు. కానీ ఇప్పుడు 'డాకు మహారాజ్' లాంటి మంచి సినిమా తీసి, దానికి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా.. సరైన ప్రమోషన్స్ లేక రూ.50 కోట్ల వసూళ్లను పోగొట్టుకుందనే అభిప్రాయం దర్శకుడు బాబీలో ఉందట. ఓ వైపు అభిమానుల ఆగ్రహం, మరోవైపు దర్శకుడు అసంతృప్తితో ఉండటంతోనే.. నిర్మాత నాగవంశీ ఇటీవల అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్ కి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.