English | Telugu

ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ కి కిక్ ఇచ్చిన బాలకృష్ణ 

గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ నందమూరి 'బాలకృష్ణ'(Balakrishna)విజయాల్నిమాత్రమే తన చిరునామాగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే రెట్టించిన ఉత్సాహంతో 'అఖండ 2 'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'అఖండ' మొదటి భాగాన్ని మించిన శివతాండవం 'అఖండ 2'(Akhanda 2)లో ఉండబోతుందనే విషయం ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'అఖండ 2 ' కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

బాలకృష్ణ రీసెంట్ గా 'ముంబై'(Mumbabi)లోని వడలా ఏరియాలో ఉన్న 'ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ'(Andhra Education society)ని సందర్శించాడు. విద్యార్థులు ఉన్న అన్ని తరగతి గదుల్లోకి వెళ్లి వాళ్లలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, వాళ్ల దగ్గర్నుంచి పలు ప్రశ్నలకి సమాధానాలు రాబట్టడం జరిగింది. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా బాలకృష్ణతో సంభాషించారు. ఆ సందేశాలు విద్యార్థులలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు బండ్లమూడి రామ్మోహన్, జనరల్ సెక్రటరీ కృష్ణప్రసాద్ తో పాటు పలువురు టీచర్స్ పాల్గొన్నారు. బాలకృష్ణ సందర్శన విద్యార్థులకు ఒక చిరస్థాయి జ్ఞాపకంగా నిలిచిపోతుందని వారు తెలిపారు.

ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ 1943 లో స్థాపించడం జరిగింది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యని భోదిస్తుండగా, సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు నాణ్యమైన విద్యని అందిస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. బాలకృష్ణ ఇటీవల ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో బెల్ ని మోగించిన విషయం తెలిసిందే.ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా కూడా నిలిచాడు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.