English | Telugu

ల‌య‌న్ డైలాగులు లీక్‌

ఈమ‌ధ్య లీకేజీల గోల ఎక్కువైంది. పాట‌లు, స‌న్నివేశాలు... ఏకంగా సినిమానే రిలీజ్‌కు ముందు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తోంది. తాజాగా ల‌య‌న్ సినిమాలోని డైలాగులు లీక‌య్యాయి. అయితే వీటిని లీక్ చేసిందెవ‌రో కాదు.. నంద‌మూరి బాల‌కృష్ణ‌. అనంత‌ర పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బాల‌య్య‌.. అక్క‌డ అభిమానుల కోరిక మేర‌కు ల‌య‌న్‌లోని రెండు డైలాగులు వ‌దిలారు.. అవి ఇవే.. నాకు పుట్టుకతోనే భగవంతుడు ప్రతీ పార్ట్ లో ఓ పవర్ దాచాడు. పొరపాటున ఒక్క పార్ట్ టచ్ చేసినా.. ఇక అంతే.. అవుట్ ! 'నన్ను పడుకోబెట్టాలంటే.. ఎప్పుడో పడుకున్న నీ తాతలు తిరిగొచ్చినా ఏం పీకలేర్రా'.. వామ్మో.. డైలాగులు అదిరిపోలేదూ..! పార్టుల్లో ప‌వ‌రేమో గానీ, బాల‌య్య మాట‌ల్లో మాత్రం కావ‌ల్సినంత ఉంది. థియేట‌ర్లో ఈ డైలాగులు ఎలా పేల‌తాయో గానీ, ఈ సినిమా బ‌య‌టకు వ‌చ్చేలోగా ఈ డైలాగుల‌పై బోలెడ‌న్ని పేర‌డీలు పుట్టేయ‌డం ఖాయం.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.