English | Telugu

బాహుబలి నిర్మాతల మాస్టర్ ప్లాన్.. ఈసారి ఎన్ని వందల కోట్లు..?

తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన సినిమా అంటే బాహుబలి అని చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా నిర్మించిన ఈ చిత్రం.. భారతీయ సినిమాలో సరికొత్త చరిత్రను సృష్టించింది. బాహుబలి పార్ట్-1 2015 జూలై 10న విడుదలై వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా.. పార్ట్-2 2017 ఏప్రిల్ 28న విడుదలై రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. బాహుబలి-1 విడుదలై నేటితో పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా విడుదల చేయబోతున్నారు.

కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పలు సినిమాలు మళ్ళీ థియేటర్లలో అడుగుపెట్టి మంచి వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు బాహుబలి వంతు వచ్చింది. రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అసలే బాహుబలి అనేది ఓ వండర్. అలాంటిది రెండు పార్ట్ లను కలిపి ఒకే మూవీగా రిలీజ్ చేస్తే.. ఆడియన్స్ ఈ సినిమాని మళ్ళీ థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపుతారు అనడంలో సందేహం లేదు. అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది. రీ రిలీజ్ ల పరంగా ఇప్పట్లో ఏ సినిమా బీట్ చేయలేని కలెక్షన్స్ బాహుబలి సాధించే అవకాశముంది. కొన్ని భారీ సినిమాలు ఫస్ట్ రిలీజ్ లో కలెక్ట్ చేసే వసూళ్లను.. బాహుబలి రీ రిలీజ్ లో కలెక్ట్ చేసినా ఆశ్చర్యంలేదు.

కాగా, బాహుబలి మూవీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇలా పాన్ ఇండియా భాషల్లో రీ రిలీజ్ అవుతున్న మొదటి సినిమా బాహుబలినే కావడం విశేషం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.