English | Telugu

అల్లు అర్జున్ కి విలన్ గా యాక్షన్ కింగ్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న మెసెజ్ ఓరియెంటెడ్ షార్ట్ ఫిల్మ్ లో బిజీగా వున్నాడు. ఇది పూర్తవగానే త్రివిక్రమ్ తో కొత్త సినిమా మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నారు. ఇప్పటికే అర్జున్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'కడలి' సినిమాలో విలన్ చేసి మెప్పించారు. ఇప్పుడు మళ్ళీ అల్లుఅర్జున్ కోసం విలన్ గా మారుతున్నారు. ఒకప్పుడు హీరోల్లాగా బీజీగా వున్నవాళ్లంతా ఇప్పుడు విలన్ వేషాలు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రీసెంట్ గా జగపతిబాబు బాలయ్య 'లెజెండ్' సినిమా కోసం విలన్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి అర్జున్ కూడా చేరిపోయాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఇప్పుడు యాక్షన్ కింగ్ కూడా జతకావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.