English | Telugu

అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు..క్షమాపణలు చెప్పిన సీపీ సీవీ ఆనంద్ 

సంధ్య థియేటర్ లో సంభవించిన రేవతి అనే మహిళ మరణానికి సంబంధించిన కేసులో అల్లుఅర్జున్(allu arjun)వైపు నుంచి ఒక వర్షన్ ఉంటే,పోలీసుల వర్షన్ మరోలా ఉంది.మీడియా పరంగా కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా న్యూస్ వస్తుంటే జాతీయ మీడియాలో మరో రకంగా ప్రసారమవుతూ ఉంది.వాటిపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతు నేషనల్ మీడియా అమ్ముడుపోయిందనే సంచలన వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది.

ఇప్పుడు తన మాటలపై సివి ఆనంద్ ఎక్స్ వేదికగా స్పందిస్తు అల్లు అర్జున్ వ్యవహారంలో వారు అడిగిన ప్రశ్నలకు కోపంలో నేషనల్ మీడియా అమ్ముడుపోయిందని మాట్లాడాను.అందుకు నేషనల్ మీడియాకు క్షమాపణలు చెప్తున్నానని ఆయన ట్వీట్ చేసాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.