English | Telugu

బన్నీ క‌థ‌లో ర‌వితేజ‌??

కందిరీగ‌తో మాస్ ద‌ర్శ‌కుడు అనిపించుకొన్నాడు సంతోష్ శ్రీ‌నివాస్. ఆ ఒక్క సినిమాతోనే యంగ్ టైగ‌ర ఎన్టీఆర్‌తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే ద్వితీయ‌వీఘ్నం గ‌ట్టిగా త‌గిలింది. ర‌భ‌స ఫ్లాప్ అవ్వ‌డంతో సంతోష్‌తో సినిమా చేయ‌డానికి ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. ర‌భ‌స టైమ్‌లోనే బ‌న్నీ కోసం ఓ క‌థ రాసుకొన్నాడు సంతోష్ శ్రీ‌నివాస్‌. దానికి తిక్క‌రేగితే.. అనే టైటిల్ కూడా పెట్టేశాడు. ర‌భ‌స హిట్ అయితే బ‌న్నీ అవ‌కాశం ఇచ్చేవాడేమో. కానీ.. ర‌భ‌స ఫ్లాప్ అవ్వ‌డంతో బ‌న్నీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌థ వినిపించే సాహ‌సం చేయ‌లేక‌పోయాడు సంతోష్. ఇప్పుడు అదే క‌థ‌కు ర‌వితేజ‌కు వినిపించి ఓకే చేయించుకోవాల‌నుకొంటున్నాడీ యువ ద‌ర్శ‌కుడు. ఆల్రెడీ ర‌వితేజ నుంచి పిలుపొచ్చింద‌ని, కిక్ 2 హంగామా ముగిశాక‌... ర‌వితేజ‌కు క‌థ వినిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి బ‌న్నీకి రాసుకొన్న క‌థ ఇది. ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేశాడ‌ట‌. మ‌రి మాస్ మ‌హారాజా క‌నిక‌రిస్తాడో లేదో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.