English | Telugu

కొండా సురేఖపై అక్కినేని అమల ఫైర్..ఢిల్లీకి ఫిర్యాదు నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ

అక్కినేని కుటుంబంపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(konda surekha)చేసిన కామెంట్స్ తో ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యింది.తమ రాజకీయ స్వార్ధం కోసం ప్రజలని తమ నటనతో అలరిస్తూ వస్తున్న సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలనే కించపరిచేలా మాట్లాడతారా అని అక్కినేని అభిమానులే కాకుండా ప్రజలు కూడా బాధపడుతున్నారు.

ఇప్పుడు ఈ విషయంపై అక్కినేని నాగార్జున(nagarjuna)సతీమణి అమల(amala)తన ఆవేదనని వ్యక్తం చేసింది.కొండా సురేఖ చేసినవన్నీ అసత్య ఆరోపణలు.దయచేసి రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు.నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.అసలు రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే, ఈ దేశం ఏమైపోతుంది. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని అమల డిమాండ్ చేశారు.

అమల కూడా హీరోయిన్ గా చాలా సినిమాల్లో చేసిన విషయం అందరకి తెలిసిందే. నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోల పక్కన చేసి మంచి నటిగా గుర్తింపు పొందింది.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.