English | Telugu

అజయ్ మృతి.. మంచు మనోజ్ ట్వీట్ వైరల్ 

మంచు మనోజ్(manchu manoj)హీరోగా 2008 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ నేను మీకు తెలుసా(nenu meeku telusa)మంచి ప్రేక్షకాదరణతో పాటు మ్యూజికల్ హిట్ గాను నిలిచింది. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై మనోజ్ సోదరి లక్షి ప్రసన్న నే నిర్మించింది. స్నేహ ఉల్లాల్, రియా సేన్ హీరోయిన్లు కాగా నాజర్, బ్రహ్మానందం వంటి వారు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఇప్పుడు ఈ మూవీ టీం శోక సంద్రంలో మునిగిపోయింది.

నేను మీకు తెలుసా కి అజయ్ శాస్త్రి(ajay sastry)దర్శకుడిగా వ్యవహరించాడు. అంతే కాదు రచనా బాధ్యతలని కూడా అందించాడు. ఇప్పుడు ఈయన చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మనోజ్ అందరకి తెలియచేసాడు. నా ఫ్రెండ్ అజయ్ చనిపోయాడన్న వార్త తెలిసి గుండె బద్దలైపోతున్నటుగా అనిపిస్తుంది.ఈ బాధను మాటల్లో చెప్పలేను. అజయ్ మరణవార్త కల అయితే బాగుండు. ఓం శాంతి, మిస్ యూ రా అజయ్.. త్వరగా వెళ్లిపోయావ్.ఇక నువ్వు లేకపోతే నా జీవితం మునుపటిలా ఉండదు.కానీ ఒక్కటి మాత్రం నిజం నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను. లవ్యూ ఫరెవర్ అంటూ ట్వీట్ చేసాడు.

హైదరాబాద్ కి చెందిన అజయ్ called 12 అనే షార్ట్ ఫిలిం తో సినీ సర్కిల్స్ లో మంచి క్రేజ్ సంపాదించాడు.కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖి, డేంజర్ సినిమాలకి దర్శకత్వ శాఖలో కూడా పని చేసాడు. 1974 జులై 26 న జన్మించారు.ఇక శాస్త్రి మృతి పట్ల పలువురు చిత్ర ప్రముఖులు తమ సంతాపాన్ని కూడా తెలియచేసారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.