English | Telugu

నెంబర్ ఇస్తాను బూతులు తిడతారా 

రంగస్థలం తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించిన నటుడు అజయ్ ఘోష్(ajay ghosh)ఇక పుష్ప తో స్టార్ నటుడుగా మారాడు. దర్శకులు తన కోసమే పాత్రల్ని సృష్టించే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బిజీ ఆర్టిస్ట్ లో కూడా ఒకడు.ఇప్పుడు మ్యూజిక్ షాప్ మూర్తి అనే మూవీతో వస్తున్నాడు. హీరోగా చేస్తున్నాడని అనుకోవచ్చు. తాజాగా ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.

మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా అందరు కలిసి చూడాల్సిన మూవీ. మీ అందర్నీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇందులోని ఎమోషన్స్ అందరికీ నచ్చుతాయి. చిన్న సినిమాకదా అని అనుకోకండి. మంచి కంటెంట్ ఉంది. అదే విధంగా థియేటర్లలోనే చూడండి. ఒకవేళ మూవీ మీకు నచ్చకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫోన్ చేసి బూతులు తిట్టవచ్చని అజయ్ ఘోష్ చెప్పాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కలర్ ఫోటో చాందిని చౌదరి(chandini chowdary)హీరోయిన్ గా చేస్తుంది.

శివ పాలడుగు డైరెక్టర్ కాగా పవన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో మెరవనున్నారు. జూన్ 14న రిలీజ్ అవుతుంది.మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.సత్య కిషోర్ భత్సు నిర్మాత.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.