English | Telugu

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి లేఖ రాసిన అడవి శేష్

తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు 'అడవి శేష్'(Adavi Sesh).2011 లో విడుదలైన పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'పంజా'లో నెగిటివ్ రోల్ పోషించడం ద్వారా అడవి శేష్ మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత క్షణం, ఎవరు, గూఢచారి, హిట్ సెకండ్ కేస్, మేజర్ వంటి విభిన్న చిత్రాల ద్వారా హీరోగా మారి తనకంటు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం 'డెకాయిట్' అనే మరో విభిన్న మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

రీసెంట్ గా భారత అత్యున్నత న్యాయస్థానం 'సుప్రీంకోర్టు'(Supreme Court)ఒక ఉత్తర్వుని జారీ చేసింది. సదరు ఉత్తర్వులలో 'దేశ రాజధాని ఢిల్లీ(Delhi)తో పాటు చుట్టు పక్కల ప్రధాన నగరాలైన నోయిడా, గురుగ్రామ్‌, గజియాబాద్‌ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదంటు పేర్కొంది.వెంటనే వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని కూడా తన ఆదేశాల్లో స్పషంగా పేర్కొంది. ఈ క్రమంలో అడవి శేష్ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి లేఖ రాసాడు. సదరు లేఖలో 'చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, ఢిల్లీలో వీధి కుక్కలను సామూహికంగా నిర్బంధించాలన్న ఆదేశం నన్ను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఇది మన చట్టపరమైన బాధ్యతలకు, భారతదేశం ఎప్పటినుంచో పాటిస్తున్న కారుణ్య విలువలకు విరుద్ధం. వీధి కుక్కలు మన సమాజంలో ఒక భాగం. వాటిని శత్రువులుగా చూడటం సరికాదు. ఈ ఆదేశాల వల్ల నిరపరాధమైన ప్రాణాలకు హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నాను. టీకాలు వేసి, స్టెరిలైజేషన్ చేసిన కుక్కలు ప్రమాదకరం కాదు. ఈ సమాజంలో గౌరవంగా జీవించే హక్కు వాటికి ఉంది. వాటిని నిర్బంధించడం అనేది తాత్కాలిక ప్రతిచర్య మాత్రమే.

స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. జంతువులపై క్రూరత్వాన్ని అరికట్టేందుకు కఠినమైన జరిమానాలు విధించాలి. ఇలాంటి చర్యల ద్వారా మనుషులు, జంతువుల భద్రతను ఒకేసారి కాపాడవచ్చు. ఇప్పటికే ఉన్న జంతు సంక్షేమ చట్టాలకు అనుగుణంగా, టీకాలు వేసిన శునకాలను వాటి ప్రాంతాల్లోనే ఉండనివ్వాలి. ఈ సమస్యకు మానవతా దృక్పథంతో పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నానని అడివి శేష్ తన లేఖలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని కోరాడు. జాన్‌ అబ్రహం, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్(Janhvi Kapoor)తో పాటు మరికొంత మంది నటీనటులు కూడా సుప్రీం తీర్పుని పునఃసమీక్షించుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.