English | Telugu
'గోపాల గోపాల' థియేటర్ల పై దాడి, కేసులు
Updated : Jan 10, 2015
వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన 'గోపాల గోపాల' మూవీ విడుదలై ఇంకా ఒక్కరోజు కూడా పుర్తికాలేదు, అప్పుడే ఈ సినిమాపై కేసులు, ఈ సినిమా ఆడుతున్న థియేటర్ లపై దాడులు మొదలయ్యాయి. ఈ సినిమా హిందువుల మనోభావాలను కించపరిచేలా వుందని రఘునాథరావు అనే వ్యక్తి హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అయితే అతను ఈ సినిమా చూసాకే కేసు పెట్టడా లేక పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారా అన్నది తెలియాల్సిన విషయం. అలాగే హైదరాబాద్ చౌటుప్పల్లో ‘గోపాల గోపాల’ ప్రదర్శితమవుతున్న థియేటర్ మీద కొంతమంది దాడి చేశారు. థియేటర్లో ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేసి సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. అయితే వీరంతా సినిమాలో తమ అభ్యంతరాలను తెలియజేయకుండా థియేటర్ల పై విచిత్రంగా వుంది.