English | Telugu

రామ్‌చ‌ర‌ణ్ క్యార్‌వాన్‌లో దొంగ‌లు ప‌డ్డారు

ఓ హీరో క్యార్ వాన్‌లో దొంగ‌లు ప‌డ్డార‌ని ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు ఎత్తుకెళ్లిపోయార‌నే వార్త ఇండ్ర‌స్ట్రీలో ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆ హీరో.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌కి ఓ సొంత క్యార్‌వ్యాన్ ఉంది. కొద్దిరోజుల క్రింద‌ట ఆ క్యార్ వేన్‌లో ఉండాల్సిన న‌గ‌దు మాయ‌మైంద‌ట‌. దాదాపు రూ.30 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ క్యాష్ ఉంద‌ని, అది సడ‌న్‌గా మాయ‌మైంద‌ని చెప్పుకొంటున్నారు. క్యాష్ మాయ‌మైంద‌న్న విష‌యం చ‌ర‌ణ్‌కీ ఆల‌స్యంగా తెలిసింద‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ సిబ్బందిలోనే ఎవ‌రో... ఈ డ‌బ్బు కాజేశార‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని తెలిసింది. అస‌లు క్యార్ వేన్‌లో అంత డబ్బు ఎందుకుంది అనేది కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే రామ్‌చ‌ర‌ణ్‌గానీ, స‌న్నిహితులుగానీ ఈ విష‌య‌మై పోలీసుల‌కు ఎలాంటి ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం కొస‌మెరుపు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.