English | Telugu

షాకింగ్ : త్రిష బ్రేక‌ప్‌కి ధ‌నుష్ కార‌ణ‌మా?

త్రిష - వ‌రుణ్‌ల మ‌ధ్య అన్ అఫీషియ‌ల్‌గా బ్రేక‌ప్ జ‌రిగిపోయింది. నిశ్చితార్థానికి తూచ్ చెప్పేసి ఎవ‌రి దాళ్లు వాళ్లు చూసుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. మ‌రోవైపు త్రిష కూడా క్ర‌మంగా సినిమాల‌పై దృష్టి పెట్టింది. అయితే ఈ బ్రేక‌ప్‌కి కార‌ణం ఎవ‌రు?? త్రిష వ‌రుణ్ తో ఎందుకు గొడ‌వ ప‌డింది?? అనే విష‌యాల‌పై త‌మిళ చిత్ర రంగం ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటోంది. వీళ్ల బ్రేక‌ప్ కి ధ‌నుష్ కార‌ణమ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ధ‌నుష్‌, త్రిష మంచి స్నేహితులు. త్రిష - వ‌రుణ్‌లు జాయింటుగా నిర్వ‌హించిన ఓ పార్టీకి ధ‌నుష్ వ‌చ్చాడ‌ట‌. అక్క‌డ త్రిష ధ‌నుష్‌ని చ‌నువుగా ప‌ల‌క‌రించింద‌ట‌. వారిద్ద‌రి మ‌ధ్య ఈ రాపోని వరుణ్ త‌ట్టుకోలేక‌పోయాడ‌ని తెలుస్తోంది. ధ‌నుష్‌తో ఫ్రెండ్ షిప్ క‌ట్ చేసుకోమని త్రిష‌కు చాలాసార్లు స‌ర్దిచెప్పాడ‌ట‌.కానీ త్రిష వ‌రుణ్ మాట విన‌లేద‌ని తెలుస్తోంది. ఈ గొడ‌వ చినికి చినికి గాలివాన‌గా మారి బ్రేక‌ప్‌కి దారి తీసింద‌ని తెలుస్తోంది. ధ‌నుష్ తో మాత్ర‌మే కాదు, చాలామంది త‌మిళ హీరోల‌తో త్రిష‌కు ఫ్రెండ్ షిప్ ఉంది. అదీ.. వ‌రుణ్‌కి న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది. త్రిష మాత్రం వ‌రుణ్ నిర్ణ‌యాల‌కు త‌ల‌వొంచ‌కుండా - త‌న మ‌న‌సు చెప్పిన‌ట్టు న‌డుచుకొంద‌ని, ఇద్ద‌రూ ఇక‌పై క‌ల‌సి జీవించ‌డం క‌ష్ట‌మ‌నుకొన్న త‌ర‌వాతే.. ఓ అంగీకారానికి వ‌చ్చి విడిపోయార‌ని లేటెస్ట్ టాక్‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.