English | Telugu
జగన్ తిరుమల పర్యటన.. నో మాస్క్, నో డిక్లరేషన్
Updated : Sep 23, 2020
ఇదిలా ఉంటే జగన్ తిరుమల పర్యటనలో కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం విమర్శలు తావిస్తోంది. ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నా.. మొదటి నుండి మాస్క్ కి దూరంగా ఉంటున్న జగన్.. తిరుమల పర్యటనలోనూ మాస్క్ లేకుండానే కనిపించారు. జగన్ ఢిల్లీ పర్యటనను ముగించుకుని నేరుగా రేణిగుంట విమానాశ్రానికి వచ్చారు. అక్కడ ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, భూమన కరుణాకర్రెడ్డిలు ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఒకరిద్దరు తప్ప జగన్ తో సహా ఎవరూ మాస్క్లు పెట్టుకోలేదు. ఇక రేణిగుంట నుంచి నేరుగా జగన్ తిరుమల చేరుకున్నారు. అక్కడ కూడా జగన్ ముఖంపై మాస్క్ కనిపించలేదు. అసలే ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ 7 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ, తిరుమల పర్యటనలో కూడా సీఎం ముఖంపై మాస్క్ కనిపించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.