English | Telugu
పెను ప్రమాదంలో బీజేపీ.. హెచ్చరించిన వైసీపీ ఎంపీ
Updated : Jul 6, 2020
గడచిన సంవత్సర కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్నఈ టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోందాని అన్నారు. ఇప్పటికే కొన్ని మిడతలు బీజేపీ లో చేరి విధ్వంసం సృష్టిస్తున్న సంగతి గ్రహించేలోగానే మిగతావి కూడా ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బిజెపి ఎలా బయటపడుతుందో చూడాలి అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. తమ స్వార్థం కోసం జెండాలు మార్చేవారంతా లిటిగెంట్ల అవతారం ఎత్తుతున్నారని, అలాగే ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదని, ఇప్పటికే పతనమైన విలువలకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్న జగన్ గారిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవని అయన ట్వీట్ చేసారు. ఈ నాయకులంతా కేవలం మీడియా ఎంటర్ టెయినర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదు అని ఎంపీ విజయసాయి రెడ్డి వారి పై మండిపడ్డారు.
విశాఖలో ఒక పబ్లిక్ పార్క్ ఆక్రమించుకున్న విశాఖ గల్లీ స్థాయి నాయకుడు ఒకరు ఎన్నికలకు ముందు జగన్ గారు అసలు అధికారంలోకి రానే రారన్నాడు. అదే విషయాన్ని అప్పట్లో పచ్చ మీడియాలో డిబేట్లతో ఊదరగొట్టి.. ఇప్పుడు తాజాగా సీఎం పూర్తికాలం అధికారంలో ఉండరంటున్నాడు. ఈ చంద్రబాబు తొత్తుల ప్రీపెయిడ్ సిమ్స్ కి రీఛార్జ్ చేయడం ఆపేస్తే నోళ్లు మూగబోతాయి అంటూ విజయసాయి ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.