English | Telugu
కరోనాతో జీవించాల్సిన కాలం! భయంతో దాక్కుంటారా? ఎమ్మెల్సీ ఇక్బాల్
Updated : May 2, 2020
సామాజిక దూరం అంటే సమాజానికి దూరం కావడం కాదు అని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత,ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు క్లౌడ్ ..జూమ్.. అంటూ మేఘాలలో జీవించడం కాదు.. భూమి మీదకు రండిని ఆయన అన్నారు.
కరోనా కట్టడిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని , ప్రభుత్వ యంత్రాగాన్ని అభినందించాల్సింది పోయి ... ప్రజల్లో లేనిపోని అపోహలు ,భయాలు ,ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం మీకు తగునా ? ఇకనైనా మీ ప్రవర్తన మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారూ అంటూ తనదైన స్టైల్ ఇక్బాల్ చురకలంటించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కనీసం సామాజిక బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కరోనాతో జీవించాల్సిన కాలం ఇది అని ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడితే మీకేందుకు తప్పుగా కనిపిస్తుందని ఆయన ప్రశ్నించారు.
కరోనా విపత్కర సమయంలో కోవిడ్ వారియర్స్ గా పనిచేస్తోన్న వాలంటీర్లను ఇదే చంద్రబాబు నాయుడు హేలన చేస్తూ మాట్లాడడాన్ని ఆయన తప్పుపట్టారు. మనం ఎప్పుడైతే సోషల్ రెస్పాన్స్ బులిటీ మరిచిపోతామో.. అప్పుడే సోషల్ క్రైసిస్ పుట్టుకొస్తాయి. ఇప్పటికైనా రాజకీయాలు మాట్లాడకుండా బాధ్యతగా మాట్లాడండని ప్రతిపక్ష నేతను ఎమ్మెల్సీ ఇక్బాల్
సూచించారు.