English | Telugu
గన్నవరం వైసీపీలో వంశీ కథ ముగిసినట్టేనా...!
Updated : Sep 12, 2020
ఇదిలా ఉండగా తాజాగా నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యేను, ఇటు వైసిపి ఇంచార్జ్ కూడా తానేనని వంశీ ప్రకటించుకున్న నేపథ్యంలో ఆయనకు పార్టీ కేడర్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న దుట్టా రామచంద్రరావు వర్గం, మొన్నటి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు వర్గం వంశీ పోకడ పై గుర్రుగా ఉన్నాయి. అంతేకాకుండా నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు వర్గాల పై వంశీ వర్గీయులు దాడులు చేస్తుండడంతో ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా చేరినట్లు సమాచారం. దీంతో గన్నవరం నియోజకవర్గంలో ఏం జరుగుతోందని పార్టీ హైకమాండ్ ఆరా తీసి అక్కడి పరిస్థితుల పై రిపోర్ట్ కూడా తెప్పించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రిపోర్ట్ ను పరిశీలించిన హైకమాండ్ పార్టీలోని కేడర్ తో అడ్జస్ట్ కాలేని నాయకులు పార్టీకి అవసరం లేదని డిసైడ్ అయిందని దీంతో ఇక వంశీని పక్కన పెట్టేసినట్లేనని జిల్లాలోని ముఖ్య నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో వైసిపిలో వంశీ కథ ముగిసినట్లేనని లేటెస్ట్ గా టాక్ వినిపిస్తోంది. దీంతో అటు టికెట్ ఇచ్చిన పార్టీ, ఇటు అధికార పార్టీ లు రెండు పక్కన పెడితే వంశీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా అవుతుందేమోనని అయన అనుచరుల ఆందోళన.