English | Telugu

ప్రమాదం వైపు పరుగెడుతున్న ప్రపంచం: డబ్ల్యూహెచ్ఓ

భారత్ తో పాటు ప్రపంచం మొత్తం కరోనా విలయ తాండవంతో బెంబేలు ఎత్తుతోంది. భారత్ లో ఐతే ప్రతిరోజు వేల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. అంతే కాకుండా కరోనా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. డబ్ల్యూ హెచ్ ఓ తాజాగా ప్రపంచం లో కరోనా విజృంభణ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు ఓ కొత్త ప్రమాదక‌ర‌ దశలోకి జారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గురు శుక్రవారాల మధ్య గడచిన 24 గంటల్లో లక్షా 50 వేల కేసులు నమోదయ్యాయ‌ని.. ఒకే రోజులో ఈ స్థాయిలో కేసులు తేలడం అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిణామం అని అభిప్రాయ‌ప‌డింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డయిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికమ‌ని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం అమెరికాతో పాటు ఆసియా దేశాల్లోనూ కరోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంద‌ని తెలిపింది.