English | Telugu
ఢిల్లీ బయలుదేరిన సీఎం జగన్.. కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ...!
Updated : Oct 5, 2020
ఈ నేపథ్యంలో వైసీపీకి ఒకటి రెండు బెర్తులిచ్చి కూటమిలోకి ఆహ్వానించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసిపి కొన్ని బిల్లులకు తన పూర్తీ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రధాని మోడీతోనూ, అలాగే బీజేపీ పెద్దలతోను జగన్ ఈరోజు, రేపు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. అయితే కేంద్ర కేబినెట్ లో చేరితే వైసీపీకి బలమైన సపోర్ట్ గా ఉన్న క్రిస్టియన్లు, మైనారిటీలు పార్టీకి దూరమవుతారని అయన సందేహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రతిపక్షాలు మళ్ళీ ప్రత్యేక హోదా స్లోగన్ ఎత్తుకునే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలు రాజకీయంగా సీఎం జగన్ కు ఇబ్బందికరమైనవే. ఇప్పటికే వైసీపీ పార్లమెంట్ లో బీజేపీకి అన్ని విధాలా సహకరిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కేంద్ర కేబినెట్ లో చేరడానికి అంగీకరిస్తారా.. లేక బయటి నుండి మద్దతు ఇస్తాం అని అంటారా.. ఏ విషయం రేపటిలోగా తేలనుంది.