English | Telugu

బీజేపీలోకి జంప్ చేయబోతున్న విజయశాంతి..? 

కొంత‌కాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతి త్వరలో బీజేపీ గూటికి చేర‌బోతున్నారనే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ సార‌థిగా ఉన్న విజ‌య‌శాంతి ప్రస్తుతం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూనే అధికార టీఆర్ఎస్ పై విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తున్నారు. అసలు ఒక ద‌శ‌లో దుబ్బాక నుండి కాంగ్రెస్ త‌రుపున ఆమె పోటీ చేస్తారని ప్ర‌చారం జరిగినా ఆమె క‌నీసం గాంధీ బ‌వ‌న్ గ‌డ‌ప కూడా తొక్క‌లేదు. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ రాష్ట్రానికి వచ్చిన సమయంలో కూడ విజయశాంతి ఎక్కడ కనిపించలేదు. అయితే గత రెండు రోజులుగా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితో విజ‌య‌శాంతి భేటీ అవుతున్నారు. సోమ‌వారం కూడా ఆమె అర‌గంట పాటు కిష‌న్ రెడ్డి తో స‌మావేశం అయ్యారు. దీంతో విజ‌య‌శాంతి పార్టీ మార్పు దాదాపు ఖాయం అని వార్తలు వస్తున్నాయి.