English | Telugu
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సోకిన కరోనా.. హోమ్ క్వారంటైన్
Updated : Sep 30, 2020
కొద్ది రోజుల క్రితం జరిగిన రాజ్యసభ సమావేశాలను నిర్వహించిన వెంకయ్యనాయుడు.. ఎంపీలంతా కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదేపదే సూచించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన సమయంలోనే 40 మంది ఎంపీలతో పాటు పలువురు సిబ్బందికి కరోనా రావడంతో సమావేశాలను కుదించారు. దీంతో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన వెంటనే ఉభయ సభల సమావేశాలను ముగించారు. ఇక దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖ నాయకులు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావంత్ కరోనా బారిన పడి ఇప్పటికే కోలుకున్నారు.