English | Telugu
గన్నవరం ఎమ్మెల్యే వంశీకి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్
Updated : Oct 24, 2020
ఏపీలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా… తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా వైరస్ సోకింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలటంతో 14 రోజుల పాటు హోంక్వారెంటైన్ లో ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఎమ్మెల్యే వంశీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. దీంతో గత నాలుగైదు రోజులుగా ఆయన్ను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.